జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో మొత్తం 5,772 ప్రత్యేక ట్రిప్పులను నడపనున్నారు. పుష్కరాల ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.