జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారబోతోంది. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతితో రూపొందించిన ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా బుధవారం ఉదయం నిర్మాణాల తొలగింపు పూజలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి క్షేత్రాభివృద్ధికి రూ. 198 కోట్లు, పురాతన అష్టతీర్థాల పునరుద్ధరణకు రూ. 60 కోట్లు మంజూరు చేశారు. వచ్చే ఏడాది జూన్లో జరగబోయే గోదావరి పుష్కరాలకు నెల రోజుల ముందే ఈ రాతి కట్టడాల పనులన్నీ పూర్తి చేయాలని దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.