తెలంగాణ ఐఏఎస్ రజత్ కుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎప్పుడో చేసిన ఫిర్యాదు చేసినా ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్పై వచ్చిన ఫిర్యాదుపై 3 నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. తన కుమార్తె పెళ్లికి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నిధులను ఉపయోగించారంటూ రజత్ కుమార్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.