కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా మొత్తం 115 మందిని విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తుది నివేదికను సీల్డ్ కవర్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు.