కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై.. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్కు విచారణ చేసే అర్హత లేదాని.. అందుకే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తాము చేసిన విజ్ఞప్తులను.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పట్టించుకోలేదని కేసీఆర్ తెలిపారు. ఇక ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు.