బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఓ పార్టీ రాజకీయం చేస్తోందంటూ పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న చంద్రబాబు.. గోదావరి నీళ్లు సముద్రం పాలు కాకుండా బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే బాధపడాల్సిన అవసరం ఏముందన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లులాంటివన్న చంద్రబాబు.. తెలుగు ప్రజల ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.