Police Warns Kasibugga Stampede Fake Video: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయ ధర్మకర్త మాటలను వక్రీకరించి వైరల్ చేస్తున్న ఫేక్ వీడియోలపై కూడా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆ వీడియోను షేర్ చేసిన వాళ్లపై చర్యలు తప్పవన్నారు.