కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడినవారికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ఘటనాస్థలిని పరిశీలించారు. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. బాధితులకు పరిహారం ప్రకటించారు, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి అండగా ఉంటామని నారా లోకేష్ వెల్లడించారు.