AP Government Compensation to Kasibugga Stampede Victims: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు చొప్పున కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.