తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్పై లక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన కోటి 20 లక్షల రూపాయలు ఇప్పించాలని, తనను, తన కుటుంబాన్ని వేధిస్తోన్న ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్వీయూ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. పిల్లల్ని బాగా చూసుకుంటానని, కొత్త జీవితాన్ని ఇస్తానని నమ్మించి కిరణ్ రాయల్ తనకు దగ్గరయ్యాడని లక్ష్మి చెబుతున్నారు. కిరణ్ రాయల్పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు. కిరణ్ రాయల్ చెప్పేవన్నీ అబద్దాలే అంది.