హైదరాబాద్ ‘నీలోఫర్ కేఫ్’ యజమాని బాబూరావు శ్రీవారికి రూ.4.5 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. కిలో బంగారంతో.. కోటి రూపాయల వజ్రాలతో తయారు చేసిన ఈ అపురూపమైన ఆభరణాన్ని, అంతరాత్మ ప్రేరణతో కేవలం ఒక నెల రోజుల్లోనే తయారు చేయించి టీటీడీకి అందించారు. ఈ విశేషమైన సేవ భక్తులందరిలో చర్చనీయాంశమైంది. ఆయన చేసిన పనికి సోషల్ మీడియాలో బాబురావుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.