హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల పై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. పదికి మించి చలాన్లు పేరుకుపోయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ద్విచక్ర వాహనాలతో ఇతర వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని నిర్ణయించారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు రూ. 40 వేల బకాయిలు ఉన్న ఆ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీఏ సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, భారీ బకాయిలు ఉన్న వాహన యజమానుల ఇళ్లకు వెళ్లి జరిమానాలను వసూలు చేయనున్నారు.