రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల ఆశల ప్రాజెక్ట్గా భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం రూ.375 కోట్లను విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నగరానికి కొత్త అందం.. ఆధునిక వసతులు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రీనరీ ప్రదేశాలు పెరగడంతో నగర వాతావరణం మరింత ఆరోగ్యకరంగా మారనుంది. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభించే అవకాశం ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.