తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాలో ఇకపై ప్రతి గ్రామంలోనూ ఒక బ్యాంకు ఏర్పాటు చేయబోతోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల ద్వారా అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం ఆధార్, మొబైల్ నంబర్ తో రూ.250తో ఖాతా తెరిస్తే ఓ క్యూఆర్ కార్డు ఇస్తారు. దీని ద్వారా అవసరమైన సమయంలో లావాదేవీలు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, బిల్లు చెల్లింపులు, డిజిటల్ సేవలు ఇంటి నుంచే పొందవచ్చు. ఆ వివరాలు..