పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయింపులో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన మంత్రి, ఫిబ్రవరి 9న వెట్టి చాకిరి విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.