కుంకీ ఏనుగులు ఎక్కడ.. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయండి

10 months ago 19
చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరులో శనివారం రాత్రి ఏనుగుల దాడిలో రామకృష్ణమరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మృతదేహంతో గ్రామస్థులు ఆదివారం వరకు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లిన రామకృష్ణమరాజు ఏనుగుల దాడిలో మృతిచెందాడు. అయితే, అడవిలో జంతువులు చనిపోతే హుటాహుటిన వచ్చే అధికారులు మనుషులు చనిపోతే పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగులు ఎక్కడని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తమ గ్రామానికి రావాలని.. తమకు ఏనుగుల దాడి విషయంలో ఏదైనా హామీ ఇవ్వాలని అన్నారు.
Read Entire Article