Chandrababu Warning To Party Leaders: చంద్రబాబు మంత్రులు, టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని.. టీడీపీ కార్యకర్తలు ట్రాప్లో పడొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని.. పార్టీ నేతలు బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినా చట్టపరంగా శిక్ష తప్పదు అన్నారు.