ప్రతిపక్ష నేత హోదాలో NTR జిల్లా నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఓచోట కాకపోతే మరోచోట దాడి చేయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు 3 చోట్ల కాపు కాశారని నందిగామ డీఎస్పీ తిలక్ వెల్లడించారు. ఈ మేరకు నలుగురిని అరెస్టు చేశామన్న ఆయన.. మరో 13 మంది అదుపులో ఉన్నారని వెల్లడించారు. కాగా, 2022 నవంబర్ 5 చంద్రబాబుపై నందిగామలో వీధి లైట్లు ఆపేసి రాళ్ల దాడి చేశారు.