ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం టీడీపీ ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. ఆదివారం రోజున కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంఛార్జి బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.