Kuppam Krishna Water Reached: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరాయి. హంద్రీ-నీవా కాలువ ద్వారా నీటిని తరలించడంతో రామకుప్పం, శాంతిపురం మండలాల్లోని చెరువులు నిండాయి. ఈ సందర్భంగా తెదేపా నాయకులు జలహారతి ఇచ్చి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. అయితే త్వరలోనే పరమసముద్రం చెరువుకు చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు.