నిజాం పాలనపై తిరుగుబాటు చేసిన కుమురం భీం వారసుడు కుమురం సోనేరావు నిరుపేదరికంలో మగ్గుతున్నారు. ప్రభుత్వం ఐదెకరాల భూమినిచ్చినా, సొంతిల్లు లేక ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్నారు. గుస్సాడీ రాజుకు ఇచ్చిన గౌరవం తనకు లేదని, ఆసరా పింఛను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.