తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేకు సంబంధించిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. దీనిపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కులగణనలో చాలా మంది పాల్గొనలేదని.. వారి వివరాలు రిపోర్టులో లేవని పలువురు ఆరోపిస్తుండటంతో.. వాళ్లకు మరో ఛాన్స్ ఇస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి వివరాలు ఇస్తే.. తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.