కూకట్పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పారిపోయారు. మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలిక తండ్రి.. కూతురు శవాన్ని రక్తపు మడుగులో చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అప్పటి వరకు అమ్మానాన్న అంటూ పలకరించిన తన కూతురు గొంతు మూగబోవడం చూసి విలవిల్లాడాడు ఆ తండ్రి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.