రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలను విడుదల చేయాలని అడిగితే.. ప్రజల ముందు తమను దోషులుగా నిలబెడుతున్నారని, ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే అని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సదస్సులో తీసుకున్న తీర్మానాల మేరకు సీఎస్కు నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.