ఏపీలో టీడీపీ కూటమి సర్కారు వేట మొదలెట్టింది. సోషల్ మీడియా వేదికగా మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చేబ్రోలు కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ మీద అసభ్యకర పోస్టులు పెట్డాడంటూ పుష్పరాజ్ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.