హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కట్టుకున్న భర్తే భార్యను ముక్కలుగా నరికి శవాన్ని మాయం చేశాడు. అచ్చం అటువంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చోటు చేసుకుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా.. తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కోపంతో ఓ లారీ డ్రైవర్ను తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.