ఆకివీడులోని పెదపేట రామాలయాన్ని పూర్తిగా కృష్ణ శిలతో 8 శతాబ్దాలు చెక్కు చెదరని విధంగా నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో ఆలయ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా రఘురామకృష్ణరాజు ఆకివీడు రామాలయం సందర్శన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు.