కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై భర్త భార్యపై హత్యాయత్నం చేశాడు. నడి రోడ్డుపై బండిరాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్థానికులు వెంటనే గమనించి భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.