రాంగ్ రూట్లో బైక్ నడుపుతూ వచ్చి ప్రమాదానికి కారణమైనందుకు ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులకు నివేదిక పంపించారు. వారం రోజులలో ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానున్నట్లు పోలీసులు తెలిపారు. తోట సుబ్రమణ్యం అనే వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి ఢీకొనటంతో.. బైక్ మీద వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి 21న ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తోట సుబ్రమణ్యం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించారు.