తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రెడీ అయింది. రెండు వరుసలతో కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిగా దీన్ని నిర్మిస్తున్నారు. పైనుంచి వాహనాలు.. కింద నుంచి గాజు గ్లాసుతో ప్రకృతి ఆస్వాదించేలా నిర్మాణం ఉండనుంది. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం తగ్గనుంది.