మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానదిపై కొత్తపల్లి నుంచి జూరాల వరకు ప్రతిష్టాత్మక హైలెవల్ వంతెన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న జూరాల డ్యాం వంతెనపై భారీ వాహనాల రాకపోకలతో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ నాలుగు వరుసల అదనపు వంతెన నిర్మాణం భవిష్యత్ అవసరాలను తీర్చనుంది.