ఏపీ, తెలంగాణను కలుపుతూ కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టెండర్లు, భూసేకరణ ప్రక్రియలు పూర్తి కావటంతో జనవరిలో పనులు ప్రారంభిస్తారని సమాచారం. ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని 1.77 కిలోమీటర్ల పొడవుతో సోమశిల- సిద్ధేశ్వరం గుట్టల మధ్య నిర్మించనున్నారు. ఇక దేశంలోనే తొలి తీగల వంతెన ఇదే అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది పూర్తి అయితే హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రయాణ దూరం 70 కిలోమీటర్ల వరకూ తగ్గుతుందని చెప్తున్నారు.