నాగాయలంక కృష్ణా నదిలో ఇటీవల వందల కొద్దీ పాములు కనిపించిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణా నదిలో వందల కొద్దీ పాములు ఈదుకుంటూ వస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే అవి పాములు కావట. పాము రూపంలో ఉండే చేపలట. స్థానిక మత్స్యకారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వీటిని ఈల్ చేపలు అని పిలుస్తారని.. ఇవేమీ ప్రమాదకరమైనవి కాదని చెప్తున్నారు.