ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. అమరావతి అభివృద్ధి కోసం 1128 కోట్లు కేటాయించారు. అలాగే అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం 432 కోట్లు కేటాయించారు. ఏపీలో తాగునీరు, డ్రైనేజీ నిర్వహణ కోసం 800 కోట్లు, గ్రామీణ ప్రాంతాలలో రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ మీద మంత్రి నారా లోకేష్ సైతం కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు.