2026-27 కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. ఏపీలో రైలు ప్రాజెక్టుల కోసం రూ.10,134 కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైల్ కారిడార్లను ప్రతిపాదించారు. వీటితో పాటుగా ఏపీ, ఒడిశా మీదుగా వెళ్లే.. చెన్నె కోల్కతా రైల్వే కారిడార్ను 4 వరుసలగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.