ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నుంచి కీలక ఆదేశాలు పొందారు. గత 20 ఏళ్లుగా తనను కామెడీ వ్యక్తిగా చూపించే వీడియోలు, వార్తలు మొత్తం ఆన్లైన్ వేదికల నుంచి తొలగించాలని ఆయన కోర్టును కోరారు. కోర్టు ఆదేశాల మేరకు.. అన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానెళ్లు అనుచిత కంటెంట్ను తొలగించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని మీమ్స్ క్రియేటర్స్ జాగ్రత్త పడటం అవసరం. ఈ నిర్ణయం ద్వారా పాల్ తన రాజకీయ ఇమేజ్ను మార్చుకోవాలని చూస్తున్నారు.