మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్పీ వాడ జడ్పీహెచ్ఎస్లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఉపాధ్యాయుడు ఆర్.కె.ప్రసాద్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 24న బీఆర్ఎస్ నాయకులు పాఠశాలలో విద్యార్థులకు కుర్చీలు పంపిణీ చేసి, వారితో కలిసి జై కేసీఆర్.. జై కేటీఆర్ నినాదాలు చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. జిల్లా విద్యాధికారి విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనగా భావించి ప్రసాద్పై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.