కేబినెట్ భేటీకి రాని పవన్ కళ్యాణ్.. రతన్ టాటా అంత్యక్రియలకు గైర్హాజరు.. కారణమదే!

1 year ago 25
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేబినెట్ భేటీ గైర్హాజరయ్యారు. అలాగే ముంబైలో జరిగిన రతన్ టాటా అంత్యక్రియలకు సైతం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. ఇందుకు ఆయన అనారోగ్యంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. అందువల్లనే ఆయన ఏపీ కేబినెట్ భేటీకి హాజరు కాలేదని తెలిసింది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముంబై వెళ్లిన ఇద్దరు.. రతన్ టాటా పార్థిక దేహానికి నివాళులు అర్పించారు,
Read Entire Article