కేబినెట్ సమావేశంలో తప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన పురపాలక శాఖ సెక్షన్ ఆఫీసర్ కె.విజయ్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హోర్డింగ్ల లైసెన్సింగ్పై చర్చ జరగాల్సిన సమయంలో పొరపాటున మరో ఫైల్ రావడంతో సీఎం, మంత్రులు అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరైన ప్రజెంటేషన్ను సమర్పించి, ఆ అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి ఈ చర్య తీసుకున్నారు. ఇక శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.