తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఏఐసీసీ పెద్దలు మళ్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లకు వేర్వేరుగా లేఖలు రాశారు. కేబినెట్ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి పాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ రెండు జిల్లాల నుంచి ప్రస్తుతం కేబినెట్లో ఎవరూ లేరని.. ఆ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.