Kerala Dgp Ravada Azad Chandrasekhar: ఆంధ్రప్రదేశ్కు చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కేరళ డీజీపీగా నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న చంద్రశేఖర్, ఐబీలో స్పెషల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. చంద్రశేఖర్ గతంలో కేరళలో వివిధ హోదాల్లో పనిచేశారు. జులై 2026లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.