విజయన్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేరళం సీఎం పినరయి విజయన్పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయన్కు కేసీఆర్ మంచి ఫ్రెండ్ అని.. ప్రధాని మోదీ రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. కేరళం ప్రజలను, యువతను విజయన్ తీవ్రంగా మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శబరిమల బంగారం చోరీ, గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు విజయన్పై ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.