అధికార టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ టిక్కెట్ కోసం కేశినేని చిన్ని తనను రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో , తాను మూడుసార్లు అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపించారు.