బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని కొనియాడారు. త్వరలోనే ఆయనపై పుస్తకం రాస్తానని తెలిపారు. కేసీఆర్ జీవితం ఆధారంగా.. మహేంద్ర తోటకూరి అనే వ్యక్తి ప్రజాయోధుడు పుస్తకాన్ని రాశారు. తాజాగా తెలంగాణ భవన్లో దీన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధుసూదనాచారి.. కేసీఆర్ చరిత్రను తరతరాలకు అందించాల్సిన అవసరం ఉందని మధుసూదనాచారి పేర్కొన్నారు. అలానే త్వరలోనే ఆయన కూడా కేసీఆర్ పై పుస్తకం రాస్తానని చెప్పుకొచ్చారు.