తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకు హాజరుకావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కేసీఆర్ నివాసం వద్ద నినాదాలు చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు ఏదైనా జరిగితే రాష్ట్రాన్ని తగులబెడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.