తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నారు. ఇందులో భాగంగా.. ఈరోజు (మార్చి 17న) సభలో కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అన్ని పార్టీల నేతలకు కీలక పిలుపునిచ్చారు. అందరూ కలిసి రావాలని.. ప్రధాని మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల గురించి అడుగుదామని కోరారు. కేసీఆర్కు కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.