బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్లు అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి కాస్తా.. కల్వకుంట్ల కిషన్రావుగా మారిపోయారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. మూసీ నదిలో వేసినట్లేనని పేర్కొన్నారు.