మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు మాత్రమే పరిమితం చేశారని, రాయలసీమకు గోదావరి జలాలను తరలించేందుకు జగన్కు సలహా ఇచ్చారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర పాలకుల కంటే కేసీఆర్ తెలంగాణకు వెయ్యి రెట్లు ద్రోహం చేశారని విమర్శించారు. చర్చకు సిద్ధమని, అవసరమైతే కేసీఆర్ ఫామ్ హౌస్కు కూడా వస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.