కేసీఆర్, జీవన్ రెడ్డిలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకుండా చేశామని చెప్పిన రేవంత్.. వచ్చే ఎన్నికల్లో కనీసం కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో నువ్వో, నేనో తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి.. కార్యకర్తలను మోసం చేసి.. బీఆర్ఎస్లో చేరారని జీవన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.