brsv meeting at mallapur Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఆయన పాలనలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హచ్చరించారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించే కుట్రను అడ్డుకుంటామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో వేచి చూడాలి.